Site icon NTV Telugu

మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేశారని.. హైదరాబాద్‌లో మెట్రోరైలు రావడానికి కారణం జైపాల్ రెడ్డి కృషియేనని.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మారువలేనివని కొనియాడారు.

రాజకీయాలలో మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాజకీయాల్లో ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి అని గుర్తుచేసుకున్నారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనదన్న ఆయన.. సోనియూ గాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ సాధన అయ్యేలా చేసిన గొప్ప నాయకుడని.. జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణలో ఆచరించి అభివృద్ధి చేయాలన్నారు.. జైపాల్ రెడ్డి తెలంగాణలో పీవీ నర్సింహారావు తర్వాత మాట్లాడుకోవాల్సిన మహనీయులు.. గొప్ప వైతాళికులని.. తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు.

Exit mobile version