హైదరాబాద్ టు షార్జా.. ఆ విమానంలో ముగ్గురే ప్రయాణికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్గా మారిపోయింది… దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మూడు నెలల క్రితం అత్యవసరంగా హన్మకొండకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఇక్కడే చిక్కుకుపోయి.. అనేక ఇబ్బందులు పడింది.. కరీంనగర్కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు. పదేళ్లుగా దుబాయ్లో నివాసముంటున్నారు. హరిత రెడ్డి ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుండగా, శ్రీనివాస రెడ్డి టెక్ మహేంద్ర కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 18న హరిత రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి కన్నుమూయడంతో ఈ దంపతులిద్దరూ కొడుకు సంజిత్ రెడ్డితో అదే రోజు హన్మకొండకు వచ్చారు. భారత్లో కరోనా వ్యాప్తితో ఏప్రిల్ 24 నుంచి యూఏఈ ప్రభుత్వం భారతీయ విమానాలపై నిషేధాన్ని విధించడంతో వారు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఆరుసార్లు విమాన టికెట్లు కొన్నప్పటికీ మారుతున్న నిబంధనలతో ప్రతిసారీ ప్రయాణం వాయిదా పడింది.. అయితే, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా కలిగిన వారు తమ దేశంలోకి రావొచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ దంపతులిద్దరూ దుబాయ్కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు.. అనుమతి కూడా లభించింది. ఇక, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ ముగ్గురితోనే ఎయిర్బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం… హైదరాబాద్ నుంచి షార్జాకు చేరుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Also Read
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!