Site icon NTV Telugu

టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి

గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో.

తాజాగా తెలంగాణ హైకోర్టు థియేటర్లకు టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ల ధరల పెంపునక గతంలోప్రభుత్వాన్ని అనుమతి కోరాయి థియేటర్ల యాజమాన్యాలు. కానీ ప్రభుత్వం దీని పై స్పందించకపోవడంతో… రేపు విడుదల కానున్న అఖండ సినిమాతో సహా ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుకుంటాని థియేటర్లు హైకోర్టును కోరాయి. ఒక్కో టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతి కోరాయి థియేటర్ల యాజమాన్యాలు. అయితే ఈ విషయంలో ఎన్ని సార్లు అడిగిన ప్రభుత్వం స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించాయి థియేటర్లు. దాంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version