NTV Telugu Site icon

జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు తెలంగాణ‌ కాంగ్రెస్ నేతలు

సభ్యత్వంపై దృష్టి సారించింది టీ కాంగ్రెస్‌. గాంధీభవన్‌లోజరిగిన సీనియర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముప్పై లక్షల సభ్యత్వం టార్గెట్‌గా చేయాలని నిర్ణయించారు నేతలు. సభ్యత్వ నమోదుకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియామకం చేశారు. వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేయనున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్‌లను కూడా నియమించనుంది పార్టీ. ఈ నెల 24 తర్వాత పూర్తి స్థాయిలో సభ్యత్వం మీద సమీక్షలు చేయనున్నారు. సభ్వతం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చేయనున్నారు.

మరోవైపు టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించాక.. ఇంత వరకు జిల్లాల పర్యటనలు చేయలేదు రేవంత్‌రెడ్డి. దీంతో త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత.. రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొత్తానికి సభ్యత్వ నమోదుతో మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు దూకుడు పెంచింది టీ కాంగ్రెస్‌.