టీడీపీకి కొరకరాని కొయ్యగా అనంతపురం పార్టీ నేతలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ దూకుడికి బ్రేక్!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
టీడీపీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారారట అనంతపురం పార్టీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో పార్టీ కమిటీలను ఏడాది క్రితం ప్రకటించారు. కొన్నిచోట్ల అధ్యక్షులను ఎంపిక చేసి మిగతా కమిటీ సభ్యులను వదిలేశారు. దీనికి కారణం ఆయా నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం లేకపోవడమే. ఆ కోవలోకే అనంతపురం వస్తోందట. అనంతపుర పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు.. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి ఉన్నారు. వీరిద్దరూ బోయ, కురుబ సామాజికవర్గాలకు చెందినవారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా అంబికా లక్ష్మీనారాయణను నియమించారు. అక్కడ సమస్య రాలేదు. కానీ.. అనంతపురంలో మాత్రం పార్టీ దూకుడికి బ్రేక్ పడింది.
పదవుల కోసం శింగనమల, ఉరవకొండ టీడీపీ నేతల పట్టు!
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని రెండు మూడు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోందట. అంతేకాకుండా శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలల్లో ఎవరికి వారు ప్రధాన కార్యదర్శి పోస్ట్ కోసం పట్టుబడుతున్నారట. రామలింగారెడ్డి, శ్రీధర్ చౌదరి అనే నేతలిద్దరూ పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు. ప్రధాన కార్యదర్శితోపాటు మిగిలిన పదవులను కూడా తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని నియోజకవర్గ ఇంఛార్జిలు పట్టుబడుతున్నారట. ఇది టీడీపీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నది నేతల కాన్సెప్ట్!
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి తలనొప్పే ఉండేది. కనీసం ఇప్పుడు అధికారంలో లేం కదా.. అని సర్దుకుని ధోరణి ఏ ఒక్క నేత చేయడం లేదు. పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నదే వాళ్ల లెక్క. అందుకే ఎక్కడా తగ్గట్లేదు. దీంతో టీడీపీ అధిష్ఠానం ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే కాలాతీతం కావడంతో పూర్తిస్థాయి కమిటీని ప్రకటించేందుకు త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఆ త్రిసభ్య బృందంలోని నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఒక క్లారిటికీ వస్తారని సమాచారం. మరి.. ఏడాదిగా జరగని పని.. త్రిసభ్య కమిటీతో కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!