టీడీపీకి కొరకరాని కొయ్యగా అనంతపురం పార్టీ నేతలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ దూకుడికి బ్రేక్!
Also Read
టీడీపీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారారట అనంతపురం పార్టీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో పార్టీ కమిటీలను ఏడాది క్రితం ప్రకటించారు. కొన్నిచోట్ల అధ్యక్షులను ఎంపిక చేసి మిగతా కమిటీ సభ్యులను వదిలేశారు. దీనికి కారణం ఆయా నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం లేకపోవడమే. ఆ కోవలోకే అనంతపురం వస్తోందట. అనంతపుర పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు.. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి ఉన్నారు. వీరిద్దరూ బోయ, కురుబ సామాజికవర్గాలకు చెందినవారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా అంబికా లక్ష్మీనారాయణను నియమించారు. అక్కడ సమస్య రాలేదు. కానీ.. అనంతపురంలో మాత్రం పార్టీ దూకుడికి బ్రేక్ పడింది.
పదవుల కోసం శింగనమల, ఉరవకొండ టీడీపీ నేతల పట్టు!
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని రెండు మూడు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోందట. అంతేకాకుండా శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలల్లో ఎవరికి వారు ప్రధాన కార్యదర్శి పోస్ట్ కోసం పట్టుబడుతున్నారట. రామలింగారెడ్డి, శ్రీధర్ చౌదరి అనే నేతలిద్దరూ పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు. ప్రధాన కార్యదర్శితోపాటు మిగిలిన పదవులను కూడా తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని నియోజకవర్గ ఇంఛార్జిలు పట్టుబడుతున్నారట. ఇది టీడీపీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నది నేతల కాన్సెప్ట్!
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి తలనొప్పే ఉండేది. కనీసం ఇప్పుడు అధికారంలో లేం కదా.. అని సర్దుకుని ధోరణి ఏ ఒక్క నేత చేయడం లేదు. పదవి ఏదైనా సరే మా వాళ్లకే ఉండాలన్నదే వాళ్ల లెక్క. అందుకే ఎక్కడా తగ్గట్లేదు. దీంతో టీడీపీ అధిష్ఠానం ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే కాలాతీతం కావడంతో పూర్తిస్థాయి కమిటీని ప్రకటించేందుకు త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఆ త్రిసభ్య బృందంలోని నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఒక క్లారిటికీ వస్తారని సమాచారం. మరి.. ఏడాదిగా జరగని పని.. త్రిసభ్య కమిటీతో కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..