కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ భేటీలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చిస్తున్నట్టు తెలుస్తుండగా.. ఈ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలకు సోనియా గాంధీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని 23 మంది అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు సోనియా గాంధీ.. అంతర్గత సమస్యలను పార్టీ సమావేశాల్లోనే చర్చించాలి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలిని తానేనని స్పష్టం చేవారు సోనియా గాంధీ.. పార్టీ వ్యవహారాలపై మీడియాకు ఎక్కితే సహించే ప్రసక్తేలేదనే నేతలను హెచ్చరించారు. ఎలాంటి సమస్యపై అయినా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ, అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, ‘జీ-23’గా ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. కొన్ని అంతర్గత సమస్యలపై పార్టీ అధినేత్రికి బహిరంగ లేఖలు రాయడం.. హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అందరికీ ప్రత్యక్షంగా వార్నింగ్ ఇచ్చారు సోనియా.. డబ్ల్యూసీ సమావేశంలో ప్రారంభోపన్యాసంలో అనేక సమస్యలను లేవనెత్తారు కాంగ్రెస్ అధినేత్రి.. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టారు. ఇదే, సమయంలో.. అన్ని సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి మోహమాటం లేకుండా అన్ని విషయాలపై మాట్లాడండి.. కానీ, అంతర్గత వ్యవహారాలపై రచ్చకెక్కొద్దని స్పష్టం చేశారు.