Site icon NTV Telugu

Supreme Court : అతిక్ హత్యపై పిటిషన్‌… విచారణ ఎప్పుడంటే..

Supreme Court And Atiq

Supreme Court And Atiq

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 28న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అతీక్ అహ్మద్ (60), అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది తీసుకువెళుతుండగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 రాత్రి మీడియా ఇంటరాక్షన్ మధ్యలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అతీక్, అష్రఫ్‌లను హత్య చేశారు. వీరి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో 2017 నుండి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై కూడా విచారణ కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం అత్యవసర జాబితాను తివారీ ప్రస్తావించారు. తన పిటిషన్ సోమవారం విచారణకు రావాల్సి ఉందని, అయితే అది జాబితా కాలేదని ఆయన ధర్మాసనానికి తెలిపారు.
Also Read: Nellore : నెల్లూరు కలెక్టరేట్ వద్ద వికలాంగుడి ఆత్మహత్యాయత్నం

ఐదుగురు న్యాయమూర్తులు అందుబాటులో లేనందున, తేదీలు ఇచ్చిన కొన్ని కేసులను జాబితా చేయలేదు. మేము దీనిని శుక్రవారం (ఏప్రిల్ 28) జాబితా చేయడానికి ప్రయత్నిస్తామని CJI అన్నారు. కొంతమంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కోవిడ్ తో బాధపడుతున్నారు. మరికొందరు ఇతర కారణాల వల్ల అనారోగ్యంతో ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరేళ్లలో ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరస్థులను కాల్చిచంపిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందులో అహ్మద్ కుమారుడు అసద్, అతని సహచరుడు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. అతీక్, అష్రఫ్‌ల హత్యపై విచారణకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Also Read:Eligibility for Marriage Scheme: మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం

ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రకారం 2017 నుండి జరిగిన 183 ఎన్‌కౌంటర్‌లపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. అతిక్ , అష్రఫ్‌ల పోలీసు కస్టడీ హత్యపై కూడా విచారించవలసి ఉందని పేర్కొన్నారు. అతిక్ హత్యను ప్రస్తావిస్తూ, పోలీసుల ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, చట్టానికి తీవ్రమైన ముప్పు అని పిటిషన్ పేర్కొంది. ప్రజాస్వామ్య సమాజంలో, పోలీసులు అంతిమ న్యాయం అందించే పద్ధతిగా మారడానికి లేదా శిక్షించే అధికారంగా మారడానికి అనుమతించబడదు. శిక్షించే అధికారం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంటుంది అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదనపు జ్యుడీషియల్ హత్యలు లేదా బూటకపు పోలీసు ఎన్‌కౌంటర్‌లకు చట్టంలో స్థానం లేదని స్పష్టం చేసింది.

Exit mobile version