ఐపీఎల్ 2021 లో ఈరోజు రేంజు మ్యాచ్ లు ఒకే సమయంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ మార్పు లేకుండానే రేంజు జట్లు బరిలోకి వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ రేంజు జట్లు మొత్తం 25 సార్లు ఐపీఎల్ చరిత్రలో ఎదురుపడగా 15 సార్లు బెంగళూర్ గెలిస్తే 10 సార్లు ఢిల్లీ గెలిచింది. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
బెంగళూర్ : విరాట్ కోహ్లీ (C), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (WK), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK/C), రిపాల్ పటేల్, షిమ్రాన్ హెట్మెయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే