గీతరచనతో రామజోగయ్య శాస్త్రి రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 24న గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు)
పాటతో ప్రయాణం చేయాలనే తొలి నుంచీ ఆశించారు రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన అభిలాష పాటలు పాడాలన్నది. కానీ, పాటలు రాసే పనిలో విజేతగా నిలిచారు. అదే చిత్రం! చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలకు కొదవే లేదు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాట లేకుండా పలకరించే చిత్రాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నేటి సినిమా రంగంలో బిజీగా సాగుతున్న గీత రచయితల్లో ముందువరుసలో ఉన్నారు రామజోగయ్య శాస్త్రి. కొందరు అచ్చు సీతారామశాస్త్రి లాగే పాటలు రాస్తారని అన్నారు. మరి కొందరు ‘చిన్న శాస్త్రి’ అంటూ అభిమానంగా పిలిచారు. ఇంకొందరు మరో వేటూరి ఆయనలో ఉన్నాడనీ వ్యాఖ్యానించారు. ఎవరు ఎలా పిలిచినా, పలుకుతూ పాటలు పలికిస్తూ, అవకాశం దొరికిన చోట పాటగాడిగా మారుతూ, అడపాదడపా తెరపై కనిపిస్తూ సాగుతున్నారు రామజోగయ్య శాస్త్రి.
Also Read
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ళ రామజోగయ్య శాస్త్రి జన్మస్థలం. తండ్రి పూజారి, వ్యవసాయం కూడా చేసేవారు. బాల్యం నుంచీ రామజోగయ్య చదువుల్లో దిట్ట అనిపించుకున్నారు. ఐదో క్లాస్ చదువుతున్న సమయం నుంచీ సినిమాలపై మోజు పెరిగింది. తాను చూసిన చిత్రాల్లోని పాటలను పాడుతూ, తానూ ఏ రోజునైనా సినిమాల్లో పాటలు పాడాలని కలలు కనేవారు రామజోగయ్య. వరంగల్ ఆర్.ఈ.సి.లో బి.టెక్, చేసిన రామజోగయ్య ఖరగ్ పూర్ ఐఐటీలో ఎమ్.టెక్, పూర్తి చేశారు. బెంగళూరులో మంచి ఉద్యోగం, వేరే దారి లేక అటువైపే వెళ్ళారు. అక్కడ కొందరు గీత రచయితలు, గాయకులను పరిచయం చేసుకున్నారు. తానూ పాడాలని ప్రయత్నించారు. అయితే వారు “నీలో మంచి సాహిత్యకారుడు ఉన్నాడు. ముందు గీతరచనలో పట్టు సాధించు” అని సూచించారు. అదే తీరున కన్నడలో పాటలు రాయడం ఇట్టే నేర్చారు. కొన్ని భక్తి గీతాలు, మరికొన్ని కన్నడ సినిమాలకు పాటలు రాశారు. జోగయ్య పనిచేసే సంస్థ ఇబ్బందులకు గురయింది. దాంతో హైదరాబాద్ చేరారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూనే దర్శకుడు కృష్ణవంశీని కలిశారు. ఆయన ద్వారా సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. ఓ వైపు పనిచేస్తూనే, మరోవైపు సీతారామశాస్త్రి వద్ద పాటల రచనలో మెలకువలు పట్టేశారు. సిరివెన్నెల ప్రోత్సాహంతోనే స్రవంతి రవికిశోర్ నిర్మించిన ‘యువసేన’ చిత్రంలో తొలిసారి గీత రచన చేశారు. అప్పటి నుంచీ సీతారామశాస్త్రి పాటలు రాసే చిత్రాలలో రామజోగయ్య సైతం కలం కలిపేవారు. అలా ఒక్కోమెట్టూ ఎక్కుతూ సాగారు. మెల్లగా సింగిల్ కార్డ్ వేయించుకొనే స్థాయికి చేరుకున్నారు. ట్యూన్ ఇచ్చినా, లేకున్నా ఇట్టే పాటలు రాసేయడం మొదలెట్టారు. దాంతో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు రామజోగయ్య శాస్త్రిని ప్రోత్సహిస్తూ సాగారు. తన అణకువతోనే రామజోగయ్య చిత్రప్రయాణం సాగిస్తున్నారు.
ఇప్పటికే వందలాది పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రికి రెండు నంది అవార్డులు ప్రకటించారు. ‘శ్రీమంతుడు’లో ఆయన రాసిన “పోరా…శ్రీమంతుడా…” పాటతో 2015లోనూ, ‘జనతా గ్యారేజ్’లోని “ప్రణామం…ప్రణామం…” పాటతో 2016లోనూ ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుకు ఎంపికయ్యారు రామజోగయ్య. “కింగ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను” వంటి చిత్రాలలో తెరపై కాసేపు కనిపించి అలరించారాయన. ఇక పాటలు పాడాలి అన్న తన చిన్ననాటి కలను కూడా కొన్ని చిత్రాల ద్వారా నెరవేర్చుకున్నారు శాస్త్రి. ఏది ఏమైనా ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాటలకు జనం పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!