బంగాళఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు పడుతున్నాయి. అటు ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
read also : సరిహద్దుల్లో డ్రాగన్ కొత్త ఎత్తులు
రెండు రోజుల పాటు గంటకు 50 నుంచి 60 కి.మీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందంటున్నారు అధికారులు . అటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఓ మోసర్తు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. దీనికి అల్పపీడనం తోడు కావడంతో.. మరింత విస్తృతంగా వర్షాలు కురిసే అకాశం ఉంది.
వచ్చే రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ.. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది.