NTV Telugu Site icon

Karnataka Election: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూకుడు

Karnataka Election

Karnataka Election

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ (సెక్యులర్)తో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి బిజెపి నాయకుడు తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. కాంగ్రెస్ తరుపున ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రెండు రోజుల ఎన్నికల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేస్తున్నారు. బెలగావి జిల్లాలోని రామదుర్గ్‌లో చెరుకు రైతులతో సంభాషించి, ఆ తర్వాత హవేరి జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏప్రిల్ 25, 26 తేదీల్లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read:Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత

ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెరకు రైతులు, యువతతో సంభాషించనున్నారు. ఆ తర్వాత సోమవారం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బెళగావి జిల్లాలోని రామదుర్గ్‌లో చెరుకు రైతులతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు పాల్గొననున్నారు. ఆ తర్వాత ‘యువ సంవాద్’ (యువతతో ఇంటరాక్షన్)లో పాల్గొనేందుకు గడగ్‌కు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పొరుగు నియోజకవర్గమైన హవేరీ జిల్లాలోని హంగల్‌లో సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. కాగా, జిల్లాలోని షిగ్గాం సెగ్మెంట్ నుంచి బొమ్మై పోటీ చేస్తున్నారు.
Also Read:Traffic: ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాఫిక్ ఉన్న నగరాలు

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘అవినీతి చెందిన లింగాయత్‌ సీఎం’ అంటూ బొమ్మైపై వివాదానికి తెర లేపారు. బొమ్మై మొత్తం లింగాయత్ కమ్యూనిటీని అపహాస్యం చేశారని ఆరోపించారు. అయితే సిద్ధరామయ్య తన వ్యాఖ్య ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం చేశారు.