Karnataka Election: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం.. ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ (సెక్యులర్)తో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి బిజెపి నాయకుడు తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. కాంగ్రెస్ తరుపున ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రెండు రోజుల ఎన్నికల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేస్తున్నారు. బెలగావి జిల్లాలోని రామదుర్గ్లో చెరుకు రైతులతో సంభాషించి, ఆ తర్వాత హవేరి జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏప్రిల్ 25, 26 తేదీల్లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read:Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెరకు రైతులు, యువతతో సంభాషించనున్నారు. ఆ తర్వాత సోమవారం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బెళగావి జిల్లాలోని రామదుర్గ్లో చెరుకు రైతులతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు పాల్గొననున్నారు. ఆ తర్వాత ‘యువ సంవాద్’ (యువతతో ఇంటరాక్షన్)లో పాల్గొనేందుకు గడగ్కు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పొరుగు నియోజకవర్గమైన హవేరీ జిల్లాలోని హంగల్లో సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. కాగా, జిల్లాలోని షిగ్గాం సెగ్మెంట్ నుంచి బొమ్మై పోటీ చేస్తున్నారు.
Also Read:Traffic: ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాఫిక్ ఉన్న నగరాలు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘అవినీతి చెందిన లింగాయత్ సీఎం’ అంటూ బొమ్మైపై వివాదానికి తెర లేపారు. బొమ్మై మొత్తం లింగాయత్ కమ్యూనిటీని అపహాస్యం చేశారని ఆరోపించారు. అయితే సిద్ధరామయ్య తన వ్యాఖ్య ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!