NTV Telugu Site icon

Piyush Goyal : సత్యపాల్ మాలిక్ ఆరోపణలపై పీయూష్ ఏమన్నారంటే..

Piyush Goyal On Satya Pal

Piyush Goyal On Satya Pal

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర ఆరోపనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. మాజీ గవర్నర్ ఆరోపణలను గోయల్ ఖండించారు. సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రగతికి ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. తాము సానుకూలంగా ఆలోచించే వారని గోయల్‌ పేర్కొన్నారు.దురదృష్టవశాత్తు, కొందరు వ్యక్తులు ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తారని, ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా దేశ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని విమర్శించారు. అలాంటి వారిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని గోయల్ చెప్పారు.
Also Read: Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..

జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడానికి ముందు అతను చివరి గవర్నర్‌గా పనిచేశాడు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బీమా కుంభకోణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మాలిక్‌ను కోరింది. వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మాలిక్‌ను ఫెడరల్ ఏజెన్సీ ప్రశ్నించడం ఏడు నెలల్లో ఇది రెండోసారి. గత ఏడాది అక్టోబరులో బీహార్, జమ్మూ కాశ్మీర్, గోవా, మేఘాలయలో గవర్నర్ బాధ్యతలను ముగించిన తర్వాత మాలిక్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.