Site icon NTV Telugu

ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయ‌ల్ క్లారిటీ.. ఇది తెలంగాణ‌ ప్రభుత్వ వైఫల్యమే !

ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ‌ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయ‌ల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామ‌న్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతుల‌కు విజ్ఞప్తి చేస్తున్నామ‌ని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్ర‌హించారు.

https://ntvtelugu.com/tpcc-squabbles-over-membership-registration/

అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ రైస్ ను కొనేందుకు అంగీకరించామ‌ని గుర్తు చేశారు.కేంద్రం వద్ద ఇప్పటికే 4 ఏళ్ల నిల్వలు ఉన్నాయని… ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమ‌న్నారు. బియ్యం సరఫరా చేసే విషయంలో ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు సార్లు వాయుదా కోరిందని పీయూష్ గోయ‌ల్ పేర్కొన్నారు. బియ్యం తరలింపున‌కు రైల్వే వాగన్లు ను ఏర్పాటు చేస్తామ‌ని… చేసుకున్న ఒప్పందం ప్రక్రారం తెలంగాణ ప్రభుత్వం బియ్యం సరఫరా చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version