Site icon NTV Telugu

నేడే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప‌రిర‌క్ష‌ణ దీక్ష

జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు మ‌ద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెల‌ల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్‌ఫ్లాంట్ ప్రైవేటీక‌ర‌ణపై పున‌రాలోచించాల‌ని కోరారు. కేంద్రం మాత్రం ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ప‌దేప‌దే చెబుతూ వ‌స్తోంది.

కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్‌ . ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి బీజేపీతో భాగ్యస్వామ్యంగా ఉన్న పవన్‌.. ఇప్పుడు విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై దీక్షకు దిగడం..పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది.

Exit mobile version