జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదేపదే చెబుతూ వస్తోంది.
కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్ . ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి బీజేపీతో భాగ్యస్వామ్యంగా ఉన్న పవన్.. ఇప్పుడు విశాఖ స్టీల్ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై దీక్షకు దిగడం..పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.