ఒక వైపు ఒమిక్రాన్..మరో వైపు స్కూళ్ళలో కరోనా టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు. కరోనా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించినట్టు సమాచారం. రాజస్థాన్లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్ కేసులు కొత్తగా బయటపడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులో ఒమిక్రాన్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లోని ఓ స్కూల్లో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడడంతో అక్కడ పరీక్షలు ముమ్మరం చేశారు.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్కేసులున్నాయి. ఢిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్- 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 , ఏపీలో నాలుగు కేసులు వచ్చాయి. దేశంలో ఇప్పటివరకు 115 మంది ఒమిక్రాన్ను జయించి బయటపడ్డారు. కర్ణాటక, కోలార్లోని వైద్య కళాశాలలో కొవిడ్-19 కలవరం కలిగిస్తోంది.
Also Read
33 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలడంతో తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడులో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పండగల సీజన్లో జాగ్రత్తలు పాటించకపోవటం, అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్లు లేకపవటం అందుకు కారణం కావచ్చంటున్నారు. దేశంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడడం లేదు. ఒకవేళ కొంతమందిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉందని ఢిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బయటపడినా… అక్కడ ఈ వేరియంట్ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?