హుజూరాబాద్ లో ముగిసిన కీలక ఘట్టం.. అసలు పోరు షూరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకఘట్టం నేడు ముగిసింది. నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే నామినేషన్ల గడువు ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఓ అంకానికి తెరపడింది. ఈనెల 11న స్క్రూటిని జరగనుండగా, 13న ఉపసంహరణ గడువు ఉండటంతో ఎవరెవరు పోటీలో ఉంటారనేది మరింత క్లారిటీ రానుంది.
నేడు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే మొత్తంగా 26మంది అభ్యర్థులే మాత్రమే నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతోంది. కరోనా నిబంధనలు, ఇతరత్రా కారణాలతో పోలీసులు నామినేషన్ కేంద్రాలకు గుంపులుగా వచ్చిన వారిని అడ్డుకొని తిరిగి పంపించారు.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
దీంతో పోలీసులకు అభ్యర్థులకు మధ్య స్పల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల తీరును ఖండిస్తూ పలువురు అభ్యర్థులు నామినేషన్ సెంటర్ వద్ద ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులకు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ కారణంగా నామినేషన్లు ఎక్కువగా నమోదు కాలేదనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వత్రంత్ర అభ్యర్థులు మాత్రం నేడు నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తానికి నేడు నామినేషన్ల ప్రక్రియ సజావుగానే ముగిసిందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నేడు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా టీఆర్ఎస్ నుంచి ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనేతలు వచ్చారు. దీంతో నామినేషన్ సెంటర్ల వద్ద పెద్దఎత్తున కోలాహలం కన్పించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియలో ఓ కీలక ఘట్టం ముగియడంతో అసలు యుద్ధానికి తెరలేచింది. పోలింగ్ తేదికి మరో 20రోజులే ఉండటంతో అభ్యర్థులంతా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా హామీలు, తాయిళాలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఎన్నిక పోరును టీఆర్ఎస్, బీజేపీ ఛాలెంజ్ తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సైతం పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏదిఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!