Site icon NTV Telugu

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తన నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో సేవ చేశారు. కరోనా బాధితులను పరామర్శించడం, వారికి అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయడం లాంటి పనులను చేపట్టారు. ఈ మేరకు ఆయన చేసిన కరోనా సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఎమ్మెల్యే ఆర్థర్‌ను ‘సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్’కు ఎంపిక చేసింది.

Read Also: పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన సానియా మీర్జా… నెటిజన్‌ల ఆగ్రహం

నందికొట్కూరులో త్వరలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్‌ను సన్మానించి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ సర్టిఫికెట్ ను అందించనున్నారు. ఈ సందర్భంగా ఆర్థర్ మాట్లాడుతూ… కరోనాను కట్టడి చేసేందుకు సీఎం జగన్ ఎంతో శ్రమించారని కొనియాడారు. ఆయన సూచనల మేరకు తాను కరోనా కష్టకాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందించానని చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా పాజిటివ్ కేసుల కట్టడికి తాను కృషి చేశానని ఆర్థర్ తెలిపారు.

Exit mobile version