అమరావతిని రాజధానిగా అంగీకరించాలని ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్న వేళ మంత్రులు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల ధరలు పెంచుకోవటం కోసమే ప్రయత్నిస్తూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు.
నగరి లో మండల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు ఎమ్మెల్యే రోజా. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే సమావేశంలో పాల్గొన్న నాయకులు కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బాగుండాలని కోరుకోవడం దారుణమని విమర్శించారు. ఇంతకాలం ముసుగులో ఉన్న దొంగలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విషం కక్కుతున్నారని ఆమె విమర్శించారు. తిరుపతిలో జరిగిన అందరిదీ అమరావతి సభపై రోజా విమర్శలు చేశారు.
చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడుతో సహా సమావేశంలో పాల్గొన్న నాయకులు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆమె విమర్శించారు.