Site icon NTV Telugu

Shinde Met Yogi: ఆ ఇద్దరు సీఎంలు కలిసిన వేళ…

Yogi And Shinde

Yogi And Shinde

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిండేతో పాటు ఆయన ప్రభుత్వ మంత్రుల బృందం కూడా ఉంది. అయోధ్యలోని శ్రీ రాంలాలాను దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆహ్వానం మేరకు షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం రాజధాని లక్నోకు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి బృందానికి స్వాగతం పలుకుతూ మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరాములు మన పూర్వీకుడని, అలాగే ఈ దేశానికి ఆత్మ అని అన్నారు.

Also Read:Telangana: పెండింగ్‌ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
శ్రీరాముడి ఆశయాలను ప్రధాని నరేంద్రమోదీ తన జీవితంలో ఇముడ్చుకుని దేశంలో రామరాజ్య దృక్పథాన్ని సాకారం చేస్తున్నారని సీఎం యోగి అన్నారు. మోడీ నాయకత్వంలో అయోధ్య ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన నగరంగా, ప్రపంచ తీర్థయాత్రల కేంద్రంగా మారుతోంది అని చెప్పారు. అయోధ్య అభివృద్ధికి వేల కోట్లతో కొత్త పథకాలు ప్రారంభించామని సీఎం యోగి అన్నారు. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారని సీఎం యోగి వివరించారు.

Also Read:Bhadradri Ramayya Abhisekam: రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చిన వానరులు
మరోవైపు సీఎం యోగితో భేటీ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం అయోధ్య పర్యటన అనుభవాన్ని పంచుకుంది. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అభినందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మన విశ్వాసాన్ని పునరుద్ధరించారని మహారాష్ట్ర సీఎం షిండే అన్నారు. ఆయన నాయకత్వంలో శ్రీరాముడి నగరం అభివృద్ధిలో కొత్త కోణాలను తాకుతోంది అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవార్థం సీఎం యోగి విందు కూడా ఏర్పాటు చేశారు.

Exit mobile version