ఎవరన్నారు బాలు లేరని… !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 4న బాలు జయంతి)
‘ఎవరన్నారు బాలు లేరని…!?’ ఈ మాటలు తెలుగువారి నోట పలుకుతూనే ఉంటాయి. ఎందుకంటే బాలు పాటలోని మాధుర్యం మనకే కాదు, యావద్భారతానికీ తెలుసు. బాలు తెలుగువారయినందుకు మనమంతా గర్విస్తూ పై విధంగా చెబుతూ ఉంటాం. అవును, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరని ఎవరన్నారు. అని మనగలమా? బాలు పాట తెలుగువారి ఆస్తి. దానిని దొంగిలించడం ఎవరి తరమూ కాదు. భౌతికంగా బాలును తీసుకు పోగలిగిన విధి బాలు పాటను, ఆయన పంచిన మధురామృతాన్నీ మన నుండి వేరు చేయలేకపోయింది. కరోనా కల్లోలం మొదలయిన రోజుల్లోనే బాధితుల కోసం బాలు ఓ నిధి ఏర్పాటుకై తన పాటతో నిధులు సేకరించారు. అది నచ్చక కాబోలు కరోనా ఆయననే కాటు వేసింది. అయితేనేమి, ఆయన నింపిన స్ఫూర్తితో కరోనా బాధితులను ఆదుకొనేందుకు ఎందరో అహరహం చేతనైనసాయం చేయడానికి కృషి చేస్తున్నారు. బాలు కోరుకున్నట్టు అతి త్వరలోనే కరోనా కరిగిపోతుంది. ఎందుకంటే దివికేగిన బాలు అక్కడ కూడా తన పాటలతో పరవశింప చేస్తూ ఉంటారు. నింగిలోని ఆ పాట మానవుల్లో ముఖ్యంగా శాస్త్రజ్ఞుల మనసులు తాకి, వారి మేధలో కరోనాను కరిగించే మందును తయారు చేసేలా చేయకమానదు.
బాలు పాటలేని తెలుగు సినిమాను ఊహించగలమా? ఘంటసాల గానంతో తెలుగు సినిమా స్వర్ణయుగం చూసింది. తరువాతి యుగానికి బాలు పాటనే బాటలు వేసింది. నాటి మేటి నటులకు, వర్దమాన కథానాయకులకు, హాస్యనటులకు అందరికీ బాలు గళం దన్నుగా నిలచి చిత్రసీమలో సిరుల వానలు కురిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా యావద్భారతంలోని పలు భాషల్లో పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక గీతాలు పాడిన గాయకునిగా చరిత్ర సృష్టించారు బాలు. “నా పాట పంచామృతం…” అంటూ బాలు పాడినట్టుగానే నిజంగా ఆయన పాట పంచామృతమే పంచింది. ఆ మధురామృతాన్ని మననం చేసుకుంటూనే అభిమానులు బాలు ఇంకా తమ మదిలోనే ఉన్నారు అని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారు.
Also Read
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
- Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
- US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
- Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
కేవలం గాయకునిగానే కాదు, నటునిగా, సంగీత దర్శకునిగా, గాత్రదాతగా ఏ ప్రక్రియ చేపట్టినా, అందులో తనదైన బాణీ పలికించి, అవార్డులూ రివార్డులూ సాధించారు బాలు. 23 నంది అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించిన బాలు, జాతీయ అవార్డుల్లోనూ ఆరుసార్లు ఉత్తమగాయకునిగా నిలచి తెలుగువారిని మురిపించారు. బాలు అన్నా అంటూ అభిమానించే ఏసుదాస్ 8 నేషనల్ అవార్డులతో అగ్రస్థానంలో నిలవగా, ఆ అన్నకు తగ్గ తమ్మునిగా తరువాతి స్థానంలో బాలు నిలిచారు. ఒకప్పుడు తినడానికి కూడా తీరికలేనంత బిజీగా సాగారు బాలు. తరువాతి రోజుల్లో కొత్తనీరుకు అవకాశమిస్తూ బాలు పాడటం తగ్గించి, నటనలో రాణించారు. ఆ తరువాత కూడా బిజీగా ఉండే ప్రయత్నమే చేశారు. ‘పాడుతా-తీయగా’ కార్యక్రమంలో వందలాది గాయనీగాయకులను తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారు. ఆ కార్యక్రమ నిర్వహణ సమయంలో బాలు నోట పలికిన పలు మాటలు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన తీర్చిదిద్దిన గాయనీగాయకులే కాదు, వారిని అభిమానించేవారు సైతం బాలు ఎక్కడికీ వెళ్ళలేదని, తమ మనసుల్లోనే నిలచి తమకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు.
ఇప్పుడు చెప్పండి… బాలు ఎక్కడికి వెళ్ళారు? ఆయన మన మనసుల్లోనే ఉన్నారు. ఆయన పాటలు మననం చేసుకున్న ప్రతీసారి మనలను పలకరిస్తూనే ఉంటారు.
తాజావార్తలు
-
Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
-
ITR: ITR ఫైల్ చేస్తున్నారా? గుడ్డిగా ఈ పనులు చేయకండి.. లేదంటే తిప్పలు తప్పవు!
-
CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
-
నెటిజన్లకు కేంద్రం అదిరిపోయే గిఫ్ట్.. మూడు కొత్త ఇంటర్నెట్ ప్లాన్లు విడుదల! అసలేంటి ‘PM-WANI’..
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!