NTV Telugu Site icon

విశాఖలో భయం భయం.. ముందుకొచ్చిన సముద్రం

జవాద్ తుఫాన్ బీభత్సం కలిగించింది. జవాద్ తుఫాన్ ముప్పు త‌ప్పింద‌ని అనుకోవడానికి వీలు లేకుండా మ‌రో ముప్పు వ‌చ్చిప‌డింది. విశాఖ‌ ఆర్కే బీచ్‌ వద్ద స‌ముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

చిల్ట్రన్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది. పార్క్‌లోని బ‌ల్లలు ఒక పక్కకు ఒరిగిపోగా, ప్రహ‌రీగోడ కూలిపోయింది. పార్క్ బ‌య‌ట 10 అడుగుల మేర భూమి కుంగిపోయింది. అధికారులు అప్రమత్తమై పిల్లల పార్కుకు వచ్చే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. పార్కులోకి ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.