ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది… ప్రజాకవిగా తన స్వరం విప్పిన గోరటి వెంకన్న పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణ యాశలో.. అడవి, పల్లెలు, అనగారిన వర్గాల బాధలే కాదు.. ప్రేయసిపై పాట రాసికూడా అందరినీ ఆకట్టుకున్నారు.. ఇప్పుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.. ఇక, తగుళ్ల గోపాల్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించగా.. దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు దక్కింది.
Read Also: మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
గోరటి వెంకన్న పాటకు పల్లె ప్రజలు, ప్రకృతి మూలాధారాలు.. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక, ఆయన సాహిత్యాన్ని, ఆయన పాటల్లోని మాధుర్యంతో పాటు.. ఎంతో విలువైన సూచనలను చూసి ముగ్ధుడైన సీఎం కేసీఆర్.. గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపారు.. 2020, నవంబర్లో శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు వెంకన్న.. సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు గోరటి వెంకన్న పాటలను సభావేదికలపై పాడిన సందర్భాలు ఉన్నాయి.. 1963లో నాగర్కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించిన గోరటి వెంకన్న.. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడేవాడు.. ప్రజా సమస్యలపై కాదు.. కొన్ని సినిమాల కోసం కూడా వెంకన్న పాటలను రాశారు.