నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. షేట్బషీరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ తరగతికి సంబంధించిన లింక్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్ను కూడా య్యూట్యుబ్లో పెట్టాడు. అయితే ఆ అగంతకుడు క్లాస్ నడుస్తున్న సమయంలో టీచర్లు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో టీచర్లు ఆ అగంతకుడికి సంబంధించిన లింక్ను బ్లాక్ చేశారు. అనంతరం పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.