Site icon NTV Telugu

ఇండియాలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు

ఇండియా కరోనా కేసులు పెరుగుతూ…త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,992 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 393 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,277 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.

ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 34114331 కు చేరింది. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 131.99 కోట్ల‌ మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 65.46 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది ఆరోగ్య శాఖ‌.

Exit mobile version