NTV Telugu Site icon

Hanuman idol: సాహిబ్‌గంజ్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Hanuman Idol

Hanuman Idol

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజధాని రాంచీకి 425 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాహిబ్‌గంజ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్టుకింద ఉన్న ఆలయంలో ఒకటిన్నర అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. సాహిబ్‌గంజ్‌లోని పటేల్ చౌక్ సమీపంలోని ఆలయంలో ఉంచిన హనుమాన్ విగ్రహాన్ని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. ఇది సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ చర్యలో పాల్గొన్నట్లు కనిపించాడు. నిందితుడిని గుర్తించారు.
Also Read: Bhadradri: భద్రాద్రి తలంబ్రాలకు భలే డిమాండ్.. ఆర్టీసీ డోర్‌ డెలివరీకి అనూహ్య స్పందన

ఉదయం విగ్రహం ధ్వంసం సంఘటన వార్త తెలియడంతో స్థానిక ప్రజలు ఆలయం సమీపంలో గుమిగూడి, దుండగుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ప్రయోగించారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, అతడిని సమగ్రంగా విచారిస్తున్నట్లు సాహిబ్‌గంజ్ డిప్యూటీ కమిషనర్ రామ్‌నివాస్ యాదవ్ తెలిపారు. పట్టణంలో పరిస్థితి బాగా అదుపులో ఉంది. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్లు, పరిస్థితి అదుపులో ఉందని సాహిబ్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ అనురంజన్ కిస్పోట్టా తెలిపారు. విగ్రహం మరమ్మత్తు చేయబడింది. అదే స్థలంలో తిరిగి ప్రతిష్ఠిస్తామని చెప్పారు.
Also Read: Pulsar Bike Jhansi: టైలర్ తప్పుగా ప్రవర్తించాడు.. తండ్రి ఆ పని చేయమన్నాడు

మరోవైపు సాహిబ్‌గంజ్ పట్టణంలో శనివారం దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో సీనియర్ పోలీసు అధికారి గాయపడ్డారు. జార్ఖండ్‌లో ఈ సంవత్సరంలో జరిగే ‘చైతి దుర్గా’ పండుగ సందర్భంగా దుర్గాదేవిని పూజిస్తారు.