NTV Telugu Site icon

Gold Smuggling: ఆయిల్‌ టిన్‌లో బంగారం.. స్మగ్లర్ల అతి తెలివి!

Gold

Gold

బంగారాన్ని అక్రమంగా రావాణా​చేసే స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్ని సార్లు కస్టమ్స్ అధికారులను పట్టుబడినా.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొన్ని సార్లు అతి తెలిపి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈరోజు శంషాబాద్​ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.24 కేజీలు బరువు ఉండి రూ. 66.24 లక్షల విలువ చేసే గోల్డ్​ను పట్టుకున్నారు. వీరిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్​ అధికారులు తెలిపారు.

Also Read:Traffic diversion at Balanagar: హైదరాబాద్‌ వాసులు అలర్ట్‌.. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ మళ్లింపు

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో రూ.65 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ టిన్‌లో బంగారం తీసుకొచ్చారు. ఇద్దరినీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్​నుంచి ప్రయాణికుడిని అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. 840 గ్రాముల బంగారం బయట పడింది. 3 క్యాప్సల్స్​ రూపంలో ఉన్న బంగారం పేస్టుగా ఉండడాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక, మరో దుబాయ్​నుంచే వచ్చిన మరో వ్యక్తిని అనుమానం వచ్చి బ్యాగ్​ తనిఖీ చేయగా.. నూనె డబ్బాల మధ్య పెట్టుకున్న 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.