NTV Telugu Site icon

భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

మ‌న ఇండియా బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు.. అయితే.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 44,950 కి చేరింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 210 పెరిగి రూ. 49, 040 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ. 600 పెరిగి రూ. 65,600 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.