Site icon NTV Telugu

చేపల కోసం వల వేస్తే…ఏం దొరికిందో తెలుసా?

చెరువులు, నదుల్లో చేపల వేట కొందరికి సరదా. మరికొందరికి జీవనోపాధి, చేప‌ల కోసం వ‌ల‌వేస్తే కొందరికి తాబేళ్ళు, పాములు, కప్పలు గట్రా పడుతుంటాయి. ఒడిశాలో చేప‌ల వేట‌కు వెళ్లిన ఓ మ‌త్స్యకారుడి వలలో పడ్డ దాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వ‌ల‌లో ఏకంగా ఒక మొస‌లి చిక్కడమే అందుకు కారణం.

ఇవాళ నా పంట పండిందనుకుని వల పైకి లాగితే సర్రున మొసలి రావడంతో ఆ మత్స్యకారుడు అవాక్కయ్యాడు. వెంట‌నే అట‌వీ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వడంతో వాళ్లు దాన్ని తీసుకెళ్లి సుర‌క్షిత స్థావ‌రంలో వ‌దిలేశారు. ఒడిశా రాష్ట్రంలోని తీరప్రాంత‌ం కేంద్రపారలో ఎక్కువమంది చేపలవేటపైనే ఆధారపడుతూ ఉంటారు. ఓ మత్స్యకారుడు చేప‌ల కోసం వ‌ల వేయ‌గా ఐద‌డుగుల పొడ‌వు ఉన్న ఉప్పునీటి మొస‌లి అతనికి చిక్కింది. దీంతో భయపడిపోయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు.

ఈ ఉప్పునీటి మొస‌లి ఆహారం కోసం లూనా న‌దిలోకి వచ్చిందని భావిస్తున్నారు. ఒడిశాలో ఉప్పునీటి మొసళ్ళ జనాభా భారీగా తగ్గిందట. 40 ఏళ్ళ క్రితం ఒడిశాలో వందలోపే ఈ తరహా మొసళ్ళు కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది రెండువేల వరకూ వీటి జనాభా వుండివుండవచ్చని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version