Site icon NTV Telugu

అగ్రరాజ్యాన్ని తాకిన ‘ఒమిక్రాన్‌’.. ఆంక్షలు విధింపు..!

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. క్రమంగా విస్తరిస్తూ వస్తోంది.. ఇప్పటికే 12 దేశాలను చుట్టేసిన ఈ మహమ్మారి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను సైతం తాకింది.. గత నెల 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్‌ ప్రకటించింది. నవంబర్‌ 22వ తేదీన సౌతాఫ్రికా నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చాడు ఆ వ్యక్తి.. అయితే, 29వ తేదీన అతడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.. మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతనితో కాంటాక్ట్ అయిన వారికి కూడా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్‌గా వచ్చిందని చెబుతున్నారు..

Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్‌.. 95 రైళ్లు రద్దు

మరోవైపు.. తమ దేశ పౌరులను అప్రమత్తం చేస్తోంది అమెరికా.. అమెరికా పౌరులంతా త్వరగా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్‌ డోసు కూడా తీసుకోవాలని సూచించారు చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌసీ.. ఇక, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. కాగా, అమెరికాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈలో కూడా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఒమిక్రాన్‌ భయంతో వణికిపోతున్న ఆయా దేశాలు ముందస్తు చర్యలను పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు టెస్ట్‌లు తప్పనిసరి చేశాయి.

Exit mobile version