బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి నియంత్రణలేని క్రిఫ్టోకరెన్సీని ఏ దేశం కూడా ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. క్రిఫ్టోకరెన్సీని వినియోగిస్తున్నప్పటికీ అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో దీనిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఎల్సాల్వెడార్ దేశం క్రఫ్టోకరెన్సీని అధికారికంగా గుర్తించి సంచలనంగా మారింది. ప్రస్తతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే మాయం అవుతుందని, బిట్కాయిన్ రూపంలో కరెన్సీ చలామణి కావడం ఖాయమని ఎల్సాల్వెడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె పేర్కొన్నారు.
Read: ఐఎన్ఎస్ ఖుక్రీ: 32 ఏళ్లలో 30 సార్లు ప్రపంచాన్ని చుట్టేసింది…
ప్రపంచం మొత్తం కూడా ఈ క్రిఫ్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోందని, కాని, ఈ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే చిన్న భయంతో వెనకడుగు వేస్తున్నారని, క్రిఫ్టో కరెన్సీతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే భవిష్యత్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం పూర్తిగా ఆగిపోతుందని నయిబ్ బుకెలె పేర్కొన్నారు.
Read: “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !
దీనికోసం ప్రస్తుతం వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిఫ్టో కరెన్సీ సురక్షితమైందని, మెరుగైందని, సైబర్ నేరాల నుంచి రక్షణ ఉంటుందని చెప్పగలగాలని, ఆ విధంగా ప్రచారం జరగాలని ఆయన పేర్కొన్నారు. బిట్కాయిన్లను అధికారికం చేయడంపై ఐఎంఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఎల్సాల్వెడార్ వెనక్కి తగ్గడం లేదు. బిట్ కాయిన్ల సేకరణపై దృష్టి సారించింది.