Site icon NTV Telugu

దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలతో పాటు వంటనూనెల రేట్లు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గించింది. దీంతో దీపావళి పండగ వేళ దేశ ప్రజలకు వంట నూనెల తయారీ సంస్థలు శుభవార్త అందించాయి. అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.7 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

Read Also: ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్: మోడీ

మిగతా కంపెనీలు కూడా ఇదే అనుసరిస్తాయని పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) తెలియజేసింది. మరోవైపు జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా (హైదరాబాద్), మోదీ నేచురల్స్ (ఢిల్లీ), గోకుల్ రెఫోయిల్స్ అండ్ సాల్వెంట్ (సిధ్‌పూర్), విజయ్ సాల్వెక్స్ (అల్వార్), గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ (అహ్మదాబాద్) వంటి సంస్థలు కూడా వంటనూనెల ధరలను తగ్గించాయి.

Exit mobile version