AIADMK Chief: అన్నాడీఎంకే చీఫ్గా పళనిస్వామి.. పన్నీర్ సెల్వం సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె చీఫ్ గా మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామిని ఎన్నికైయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై గత కొంత కాలంగా మాజీ సీఎంలు ఈపీఎస్- ఓపీఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఓపన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన సవాలను హైకోర్టు తిర్కరించింది. దీంతో పళనిస్వామికి మార్గం సుగుమమైంది. వెంటనే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ని అధికారికంగా ప్రకటించింది. నాయకత్వ వివాదానికి పరిష్కారం లభించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.
Also Read:Selfie Video: దువ్వాడలో దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
మరోవైపు OPS టీం ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్కు అప్పీల్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది జూలైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ఆమోదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. తాత్కాలిక చీఫ్గా ఆయన కొనసాగింపునకు సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం పచ్చజెండా ఊపింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం తీసుకునే బాధ్యతను మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక కోసం EPS శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
Also Read:Separatist: వేర్పాటువాదులపై అణిచివేత.. పంజాబ్ పోలీసులకు సిక్కుల అల్టిమేటం
సంస్థాగత ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాలి. అత్యున్నత పదవిని ప్రాథమిక సభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నుకోబడిన ప్రధాన కార్యదర్శి మాత్రమే సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తారు. అయితే, ఇందుకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని మాజీ సీఎం ఓపీఎస్ ఆరోపిస్తున్నారు. సరైన ప్రక్రియ లేదని, వారు జేబు దొంగలా చేసే విధంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారని ఓపీఎస్ విమర్శించారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి జె జయలలిత మరణించినప్పటి నుండి పార్టీకి ద్వంద్వ నాయకత్వం ఉంది. OPS, EPS వరుసగా అన్నాడీఎంకే సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అయితే ఇటీవల ఈపీఎస్ వర్గం ఒకే నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. జూలై 11, 2022న ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు నేతల మధ్య నాయకత్వ పోరు నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పన్నీర్సెల్వం, అతని సహాయకులను బహిష్కరించింది.
Also Read:Sai Pallavi: ముంబైలో మెరిసిన ఎర్ర గులాబీ…
ఇదిలా ఉంటే.. మరోసారి మాజీ సిఎం పన్నీరు సేల్వం రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పన్నీర్ సెల్వం బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎఐడిఎంకెలో ఎంట్రీ కష్టం అవ్వడంతో ఆలోచన పడ్డా ఓపిఎస్.. బిజెపిలో వెలుతారని తమిళనాట పొలిటికల్ సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!