హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది… హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
గత రెండు మూడు రోజులుగా పీసీసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి చెందిన నేతలు కూడా దీనిపై కసరత్తు చేశారు.. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి లేకపోయినా.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.. ఈ నేథప్యంలోనే మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై కొండా సురేఖతో పాటు.. సీనియర్ నేతలతో కూడా సంప్రదింపులు జరిపింది పార్టీ.. రెండు మూడు రోజుల్లో అధికారికంగా కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఆమెనే బరిలోకి దిగితే.. మూడు ప్రధాన పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించినట్టు అవుతుంది.
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..