100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సిఎం కెసిఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదని.. 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుందని స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టామని తెలిపారు. సిద్దిపేట తన పుట్టిన జిల్లా అని.. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. సిద్దిపేటతో సహా రాష్ట్రంలో మరో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
read more :వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
- Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
గతంలో మంచి నీటికి ఇబ్బందులు పడ్డామని.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి ఉన్నాయని తెలిపారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. ఇందుకోసమే తెలంగాణను కోరుకున్నామని స్పష్టం చేశారు కెసిఆర్. కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సబ్ స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది అని గుర్తు చేశారు. కరెంటుతో ఎలాంటి బాధలు అనుభవించామో.. సిద్దిపేట వాసులకు బాగా తెలుసు అని… కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయని.. తెలంగాణ రాక ముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
-
West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
-
Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..