ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం..! నేతల భాషపై చర్చకు సిద్దమా..?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. టీడీపీ కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే.. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించలేదని.. దీంతో గవర్నర్కు ఫిర్యాదు చేశాం అన్నారు.. టీడీపీ నేతలను చంపేందుకు.. నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపిన చంద్రబాబు.. అమిత్షాకు ఫోన్ చేసి.. ప్రభుత్వం-పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారని వివరించానని.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరాన్నారు.
మా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చారు?
మా పర్మిషన్ లేకుండా పోలీస్ అధికారి మా కార్యాలయానికి ఎందుకొచ్చారు..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. డీజీపీ ఇంటికో.. ఆఫీసుకో పర్మిషన్ లేకుండా వస్తే ఊరుకుంటారా..? అని నిలదీసిన ఆయన.. ఈ డీజీపీ కొత్త సంస్కృతికి తెర లేపారు.. హ్యాట్సాఫ్ డీజీపీ.. శభాష్ డీజీపీ.. అంటూ ఎద్దేవా చేశారు. ఇక, ప్రభుత్వానికి చేత కాకుంటే పోలీసు వ్యవస్థను మూసివేసి ఇంటికెళ్లండి అంటూ మండిపడ్డారు చంద్రబాబు.. హోం మంత్రికి.. డీజీపీకి సిగ్గనిపించడం లేదా..? అంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత.. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి ఏం చేయాలో మాకు తెలుసన్నారు.. ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించిన ఆయన.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆర్టికల్ 356 పెడతారు.. ఎప్పుడూ ఆర్టికల్ 356ను సమర్ధించని పార్టీ.. దాని గురించి మాట్లాడుతోంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు.. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని ఆరోపించారు చంద్రబాబు.. పొరుగు రాష్ట్రం డీజీపీ ఏపీలో గంజాయి సాగు జరుగుతోందంటూ ప్రకటనలిచ్చారు.. తెలంగాణ సీఎం తన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సమీక్ష పెట్టారని గుర్తుచేశారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
Read Also: రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..
బహిరంగ చర్చకు సిద్దమా..?
నేతల భాషపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ చేశారు చంద్రబాబు.. గంజాయి స్మగ్లింగ్, సాగుపై ఉక్కుపాదం మోపండి.. మేమూ సహకరిస్తామన్న ఆయన.. ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఏపీలో ఉంది.. వైసీపీతో.. ప్రభుత్వంతో తెలుగుదేశానికి ఆస్తుల తగాదాలు లేవు.. దాయాదుల పోరు లేదు… కానీ, ఈ దాడులు ఏంటి? అని ఫైర్ అయ్యారు.. రోడ్లు వేయలేదు.. పన్నులు పెంచారు.. అప్పులు పాలయ్యాం.. ఏ పిల్లల కోసం పాటుపడుతున్నామో.. ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కానుంది.. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతోంది.. ఇంత వరకు నా మంచితనం.. పార్టీ మంచితనం చూశారు.. ఎల్లకాలం ఇది సాగదు అని హెచ్చరించారు. మతాలు, కులాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని ఆరోపించిన ఆయన.. ఎప్పుడైనా దేవాలయాలపై దాడులు జరిగాయా..? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
తాజావార్తలు
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో