NTV Telugu Site icon

కొనసాగుతోన్న చంద్రబాబు దీక్ష

టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఇవాళ ముగియనుంది.. గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు.. గురువారం ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష కొనసాగుతుండగా.. ఇవాళ రాత్రి దీక్షను ముగించనున్నారు చంద్రబాబు.. ఇక, నిన్న కేవలం అర లీటర్‌ మంచినీరు మాత్రమే చంద్రబాబు తీసుకున్నారని పార్టీ నేతులు చెబుతున్నారు.. దీక్ష రెండో రోజుకు చేరుకోవడంతో.. కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షల పేరుతో ఈ రోజు కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.