Site icon NTV Telugu

3 టాయిలెట్లు కట్టలేని జగన్‌ 3 రాజధానులు కడతారా : చంద్రబాబు

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్‌ 3 రాజధానులు కడతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సీపీఎస్‌ రద్దుపై జగన్‌ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హామీ నేరవేర్చని జగన్‌ ప్రజలకు ఇప్పుడేం చెబుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్‌ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రెండెన్నరేళ్లలో రాష్ట్రాన్ని జగన్‌ దారుణంగా ధ్వంసం చేశారన్నారు.

వైసీపీ నేతలు ఢిల్లీ ఆర్ధిక కష్టాల నుంచి కాపాడాలని కేంద్రం దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నారని ఆయన అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం గురించి కేంద్రం వద్ద వైసీపీ చర్చించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని.. తప్పని చెప్పిన వారిపై అక్రమంగా కేసులు పెడుతూ వైసీపీ నేతలు భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు.

Exit mobile version