Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Central Allows To Andhra Pradesh Government For Additional Borrower

కేంద్రం వరం.. ఆర్థిక కష్టాల నుంచి జగన్ సర్కారు గట్టెక్కినట్టేనా?

Published Date :September 15, 2021 , 1:25 pm
By Manohar
కేంద్రం వరం.. ఆర్థిక కష్టాల నుంచి జగన్ సర్కారు గట్టెక్కినట్టేనా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అన్ని రాష్ట్రాల మాదిరిగానే కరోనా ఎంట్రీ తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందే ఏపీ అప్పుల్లో కురుకుపోయింది. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరిట చేసిన అప్పులు వేలకోట్లలో ఉన్నాయి. ఈ భారం మొత్తాన్ని కూడా జగన్ సర్కారే మోయాల్సి వస్తోంది. వీటి వడ్డీల భారమే ప్రతినెలా తడిచిమోపడు అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు సంక్షేమం కోసం ప్రతీ నెల వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు ఏపీ అభివృద్ధిపై దృష్టిసారించిన సర్కారు నిధులను సమీకరించే పనిలో పడింది.

అయితే కరోనా పిడుగు ఏపీ ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీసింది. అరకొరగా వస్తున్న ఏపీ ఆదాయం పూర్తిగా పడిపోవడంతో సర్కారు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలను ఆపిన దాఖలాల్లేవు. ప్రభుత్వ పథకాలతో లక్షలాది మంది సామాన్య, పేద ప్రజలు లబ్ధిపొందుతుండటంతో వాటి అమలుకే ఆయన మొగ్గుచూపారు. ఈ పథకాలపై ఆర్థికభారం పడకుండా చర్యలు తీసుకున్నారు. ఏపీకి ఎక్కడి నుంచి నిధులు రావాల్సి ఉన్నాయో గుర్తించి వాటిని రాబట్టే పనిలో పడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల్లో ఏపీకి ఇచ్చిన హామీలపై ఏపీ సర్కారు ఫోకస్ పెట్టింది.

Also Read

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
Add as a preferred
source on google

నిధులేమీతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి కేంద్రం నుంచి వరుసగా నిధుల వరద పారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి గత పదిరోజుల్లో మూడోసారి రుణ సేకరణకు అనుమతి లభించింది. ఏపీకి దాదాపుగా పదివేల కోట్లకుపైనా అదనంగా రుణం పొందటానికి ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రుణ పరిమితి అవకాశం అన్ని రాష్ట్రాలకు 0.5శాతం మేర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడా ఏపీకి బాగానే కలిసొచ్చింది. తాజాగా కేంద్రం ఏపీకి రూ 2,655 కోట్ల మేర రుణాల అనుమతి ఇచ్చింది.

మొత్తం 11 రాష్ట్రాలకు జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణం సేకరించటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తంగా 11రాష్ట్రాలకు రూ 15,721 కోట్ల మేర రుణ సేకరణకు అనుమతి లభించింది. ఇందులో ఏపీకి 2,655 కోట్ల మేర వెసులుబాటు కలిగింది. వీటి ద్వారా మూల ధన వ్యయాన్ని పెంచటానికి అవసరమైన వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో రాష్ట్రాలు దెబ్బతినగా ఆయా రాష్ట్రాలు కేంద్రానికి పలు వినతులను సమర్పించాయి. వీటి పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలి క్వార్టర్ లో మూల ధన వ్యయ మొత్తంలో 20 శాతం ఖర్చు చేయాలన్న షరతును 15శాతానికి తగ్గించింది. దీంతో అదనపు రుణ సౌలభ్యం దక్కింది.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ 27,589 కోట్లు మూలధన వ్యవయంగా ఖర్చు చేయాలని తొలుత కేంద్రం షరతు విధించింది. అయితే ఆ తర్వాత ఆ పరిమితిని రూ. 26,262 కోట్లకు తగ్గించింది. మూలధన పరిమితిలో కొంత ఖర్చు చేయాల్సిన పరిమితిలో కొంత తగ్గించిన కారణంగా ఏపీకి డిసెంబర్ వరకు రూ.10,155 కోట్ల రుణ సౌలభ్యం లభించింది. కేంద్రం నుంచి క్రమంగా నిధులు అందుబాటులోకి వస్తుండటంలో క్రమంగా ఏపీ ఆర్థిక కష్టాల నుంచి క్రమంగా కోలుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకొనేందుకు ఏపీ సర్కారు గతంలో కంటే భిన్నంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap
  • borrower
  • central government
  • cm jagan

తాజావార్తలు

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions