Business Headlines 15-07-22: ఆల్ ఇన్ వన్ బిజినెస్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్టెల్లో 1.2 శాతం వాటా గూగుల్కి.
ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్టెల్ సెబీకి తెలిపింది.
Also Read
- London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి
క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో మొత్తం విలువ 123.81 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. డిపాజిట్లు 9.77 శాతం పెరగటంతో మొత్తం విలువ 169.61 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది.
52 వారాల కనిష్టానికి ఐటీ షేర్లు
ఐటీ షేర్లు నిన్న కూడా నేల చూపులు చేశాయి. నిఫ్టీలో 52 వారాల కనిష్టం కన్నా దిగువకు పడిపోయాయి. ఇంట్రా-డేలో 26,399.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేసుకున్నారు. నిఫ్టీలో ఐటీ షేర్లు ఇంత తక్కువకి ట్రేడ్ అవటం గతేడాది మే నెల తర్వాత ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోనూ ఐటీ షేర్ల వ్యాల్యూ 1.44 శాతం డౌన్ అయింది.
0.4 శాతానికి తగ్గిన చైనా ఆర్థిక వృద్ధి
చైనా ఆర్థిక వృద్ధి గతేడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి 0.4 శాతానికి తగ్గింది. కరోనా లాక్డౌన్ల వల్ల షాంఘై పోర్టులో ఎగుమతులు పడిపోయాయి. షాంఘై పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ అనే సంగతి తెలిసిందే. లాక్డౌన్ల కారణంగా షాంఘైతోపాటు దేశంలోని పెద్ద నగరాల్లో కూడా తయారీ రంగం డీలా పడిపోయింది.
ఇండియాలోకి భారీగా పెట్టుబడులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), అమెరికా మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. యూఏఈ దాదాపు 15,500 కోట్ల రూపాయలు, అమెరికా సుమారు 2,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఐ2యూ2 ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కుల డెవలప్మెంట్ కోసం యూఏఈ ఇన్వెస్ట్ చేస్తుండగా గుజరాత్లోని ద్వారకాలో రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అమెరికా పెట్టుబడి పెట్టనుంది. ఐ2 అంటే.. ఇండియా, ఇజ్రాయెల్. యు2 అంటే యూఏఈ, యూఎస్.
రికార్డు స్థాయికి వాణిజ్య లోటు.
జూన్ నెలలో అంచనాను మించి వాణిజ్య లోటు నెలకొంది. రికార్డ్ స్టాయిలో 26.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్, బంగారం, బొగ్గు దిగుమతులూ అదే స్థాయిలో పెరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. దిగుమతులు 57.55 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లకు చేరాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!