ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ సమీపంలో వంతెనపై ప్రమాదం జరిగింది. తుంగభద్ర ఎగువ కాలువ 115/167 కిలోమీటర్ వద్ద నిర్మించిన వంతెనపై బులేరో లగేజీ ఆటో వస్తుండగా అకస్మాత్తుగా వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) అనే మహిళ కూలి కాలువలో గల్లంతయింది. మిగతా 29 మంది కూలీలను సురక్షితంగా రక్షించారు స్థానికులు. గల్లంతయిన మహిళా కూలీ కోసం గాలిస్తున్నారు.