NTV Telugu Site icon

చావుడప్పులు ఎవరికి కొడతారో చూద్దాం.. రఘునందన్

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రేపు చావుడప్పుల పేరిట బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదన్నారు.

పరిపాలన చేతనవుతాలేదని ఒప్పుకొని అస్త్రసన్యాసం చేసి ముగ్గురం ఉన్నాం మాకు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో రెండు సంవత్సరాలు నీ కంటే గొప్పగా పాలిస్తామన్నారు. ఇప్పటికైతే చేతనైతే పాలించు లేకపోతే ప్రజల ముందుకొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వడ్ల పంచాయతీ అనే కిరికిరి తీసుకొచ్చి కావాలని దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి కొత్త పంచాయితీని తెలంగాణలో పెట్టారని రఘునందన్ విమర్శించారు సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎప్పుడు చావు డప్పులు కొట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.