బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళీధర్రావు బ్రాహ్మణులు, బనియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో ఓ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఆయన నోరుజారారు. బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు బీజేపీలో ఉంటే మీడియా కూడా తమ పార్టీని బ్రాహ్మణ, బనియా పార్టీగా పిలుస్తుందని.. అయితే బీజేపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందని మురళీధర్రావు పేర్కొన్నారు.
Read Also: స్టైలుగా బీడీ కాల్చిన వైసీపీ ఎమ్మెల్యే
అయితే బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్రావు వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మురళీధర్రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. బ్రాహ్మణులు, బనియాలను ఆ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని ఆయన విమర్శించారు. కాగా తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్రావు ఆరోపిస్తున్నారు.
