చదువుకున్న కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఉదయం ఢిల్లి నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆర్మీ కళాశాలకు వెళ్తున్న సమయంలో కూనూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది సైనికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో జన్మించిన బిపిన్ రావత్ ప్రాథమిక విద్యను డెహ్రడూన్, సిమ్లాలో పూర్తిచేశారు. తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీటు సంపాదించారు.
Read: ఎంఐ హెలికాప్టర్ సాంకేతికంగా భళా… కానీ…
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
తమిళనాడులోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్లో ఉన్న నేషనల్ డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లి అక్కడ హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తిచేసి ఇండియాలో అహల్య విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తిచేశారు. అప్పటికే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన బిపిన్ రావత్ అంచలంచెలుగా ఎదుగుతూ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని చేపట్టారు. తాను చదువుకున్న వెల్లింగ్టన్ ఆర్మీ కళాశాలలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.
తాజావార్తలు
-
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!