NTV Telugu Site icon

బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలే అతిథులు ఎవరో తెలుసా?

బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో గ్రాండ్ ఫినాలేను నిర్వహించబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్‌ను అతిథులుగా ఆహ్వానిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథులను పిలిచినట్లు టాక్ నడుస్తోంది.

Read Also: ‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?

బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలేకు గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి విన్నర్‌కు ట్రోఫీని అందించగా.. ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటించిన రామ్‌చరణ్, ఆలియాభట్ జంటను బిగ్‌బాస్ నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా టాప్-5లో వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, శ్రీరామ్‌ ఉన్నారు. వీరిలో విన్నర్‌గా నిలిచేది ఎవరో వచ్చే ఆదివారం రివీల్ కానుంది. వీజే సన్నీనే బిగ్‌బాస్-5 విన్నర్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.