NTV Telugu Site icon

బ్రేకింగ్:చిన్నారులకు భారత్ బయోటెక్ గుడ్ న్యూస్..వ్యాక్సిన్ రెడీ

కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు మార్గం సుగమం కానుంది.

దేశంలో 18 సంవత్సరాల లోపువారికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. తాజాగా డీసీజీఐ అనుమతించడంతో చిన్నారులకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 18 ఏళ్లలోపువారికి సైతం కోవాగ్జిన్ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పిల్లలకు కూడా కరోనా సోకుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర వాడకానికి మొదటి టీకాను అనుమతి ఇవ్వాలని ఒత్తిడి కేంద్రంపై పెరిగింది. దీంతో నిపుణుల కమిటీ కోవాగ్జిన్ చిన్నారుల టీకాకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.