అచ్చెన్న ప్రజల్ని మరిచిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా?
అచ్చెన్న అందుబాటులో లేరని కేడర్ ఆందోళన
వైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా.. ఆ పార్టీ కేడర్ మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ రాజకీయ ఎత్తుగడలకు అచ్చెన్నతోపాటు పార్టీ కేడర్ ఉక్కిరి బిక్కిరైన ఉదంతాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో తమ ఎమ్మెల్యేను కలిసి బాధలు చెప్పుకొందామని టీడీపీ కేడర్ భావించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారని ఆనందించాలో.. తమకు పిలిస్తే పలికేంత దూరంలో లేరని బాధపడాలో అర్థం కావడం లేదని అంటున్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
విజయవాడ లేదా విశాఖలోనే ఉంటున్నారట
ప్రస్తుతం టెక్కలిలో టీడీపీ కేడర్ చాలా ఇబ్బంది పడుతోంది. చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు రెండు సార్లు జైలుకెళ్లడంతో.. తమ నాయకుడికే ఇలా ఉంటే.. మన పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందారు. ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హవా నడుస్తోంది. ఇంతలో ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెన్న బిజీ అయిపోయారు. టెక్కలికి.. ఇక్కడ టీడీపీ కేడర్కు సమయం కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ సమయం విజయవాడ లేదంటే విశాఖకే పరిమితం అవుతున్నారట అచ్చెన్నాయుడు.
ఎర్రన్నాయుడిని గుర్తు చేసుకుని బాధపడుతున్న కేడర్
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలిలో అచ్చెన్న మార్కు కనిపించడం లేదన్నది కేడర్ చెప్పేమాట. జిల్లాలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా పార్టీ కేడర్కు సమయం కేటాయించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్న నుంచి అదే ఆశించిన టీడీపీ తమ్ముళ్లకు నిరాశ తప్పడం లేదని అంటున్నారు. తమ నేతను కలుసుకోవాలంటే విజయవాడ, లేదా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు కార్యకర్తలు. అందుకే మా అచ్చెన్న టెక్కలిని మర్చిపోయారని కేడర్ చెవులు కొరుక్కుంటోందట. నలుగురు కార్యకర్తలు కలిస్తే తమ బాధలు ఒకరికి ఒకరు చెప్పుకొని ఊరట చెందుతున్నారట. మరి.. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు గమనించారో లేదో..?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!