అచ్చెన్న ప్రజల్ని మరిచిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా?
అచ్చెన్న అందుబాటులో లేరని కేడర్ ఆందోళన
వైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా.. ఆ పార్టీ కేడర్ మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ రాజకీయ ఎత్తుగడలకు అచ్చెన్నతోపాటు పార్టీ కేడర్ ఉక్కిరి బిక్కిరైన ఉదంతాలు ఉన్నాయి. ఈ కష్ట సమయంలో తమ ఎమ్మెల్యేను కలిసి బాధలు చెప్పుకొందామని టీడీపీ కేడర్ భావించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారని ఆనందించాలో.. తమకు పిలిస్తే పలికేంత దూరంలో లేరని బాధపడాలో అర్థం కావడం లేదని అంటున్నారు.
Also Read
విజయవాడ లేదా విశాఖలోనే ఉంటున్నారట
ప్రస్తుతం టెక్కలిలో టీడీపీ కేడర్ చాలా ఇబ్బంది పడుతోంది. చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటికే పరిమితం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు రెండు సార్లు జైలుకెళ్లడంతో.. తమ నాయకుడికే ఇలా ఉంటే.. మన పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందారు. ప్రస్తుతం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హవా నడుస్తోంది. ఇంతలో ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెన్న బిజీ అయిపోయారు. టెక్కలికి.. ఇక్కడ టీడీపీ కేడర్కు సమయం కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ సమయం విజయవాడ లేదంటే విశాఖకే పరిమితం అవుతున్నారట అచ్చెన్నాయుడు.
ఎర్రన్నాయుడిని గుర్తు చేసుకుని బాధపడుతున్న కేడర్
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలిలో అచ్చెన్న మార్కు కనిపించడం లేదన్నది కేడర్ చెప్పేమాట. జిల్లాలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా పార్టీ కేడర్కు సమయం కేటాయించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్న నుంచి అదే ఆశించిన టీడీపీ తమ్ముళ్లకు నిరాశ తప్పడం లేదని అంటున్నారు. తమ నేతను కలుసుకోవాలంటే విజయవాడ, లేదా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు కార్యకర్తలు. అందుకే మా అచ్చెన్న టెక్కలిని మర్చిపోయారని కేడర్ చెవులు కొరుక్కుంటోందట. నలుగురు కార్యకర్తలు కలిస్తే తమ బాధలు ఒకరికి ఒకరు చెప్పుకొని ఊరట చెందుతున్నారట. మరి.. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు గమనించారో లేదో..?
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?