ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
కాగా సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్మెంట్ ఇవ్వగా జగన్ కోలుకున్నారు. అయితే తాజాగా అదే కాలికి మరోసారి వాపు రావడంతో జగన్ మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో జగన్ కాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Read Also: నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం
