Site icon NTV Telugu

కార్పొరేషన్ కాబోతున్న అమరావతి

ఏపీ రాజధానికి మరో హంగు రాబోతోంది. అమరావతి త్వరలో కార్పొరేషన్‌గా మారబోతోంది. రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటుకానుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించారు. అనంతరం కార్పోరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Exit mobile version